అమరావతి : మనిషికి ఉత్సాహం వచ్చిన ఆవేశం వచ్చినా ఆగదన్నట్లు ఏపీలో ఓ మంత్రి అత్యుత్సాహంతో సొంత ముఖ్యమంత్రినే అనరాని మాటలు అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఉన్న ధ్వేషంతో తన ప్రసంగాన్ని ఆవేశంతో కొనసాగిస్తూ చంద్రబాబు బదులు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఔట్డేటెడ్ పొలిటీషియన్ అని వ్యాఖ్యనించడం అక్కడికి వచ్చిన 16 మంది వైసీపీ మంత్రులకు ఆశ్చార్యానికి గురి చేసింది, సామాజిక న్యాయభేరి పేరిట ఏపీ మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్ర మూడో రోజు కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.
గన్నవరం వద్ద నిర్వహించిన సభలో ఏపీ సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబు తీరును, పాలనపై విమర్శలు గుప్పించారు. అదే జోష్లో మాట్లాడుతూ అధికారం కోల్పోయి ఈర్ష్య, ధ్వేషం, కుళ్లు , కుతంత్రాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారారు. మహానాడులో చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు ఉన్నాయని బీసీ నాయకుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫొటో ఎందుకు పెట్ట లేదని ప్రశ్నించారు.