అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల రగడ కొనసాగుతుంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య ముందస్తు వివాదంపై ఆయా పార్టీలకు చెందిన నాయకుల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటు న్నాయి. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు బోండా ఉమా మరోసారి ముందస్తు పై మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలు వస్తాయని సంకేతాలు ఇస్తుండగా సహచర మంత్రులు భిన్నంగా మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికలు రావంటున్నారని, అది అబద్ధమని ఉమ అన్నారు.
ఈ సారి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఛాన్సే ఆఖరి అవకాశం అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అధినేత నుంచి కార్యకర్త వరకు ప్రజల్లోనే ఉంటామని, టీడీపీకి 160 సీట్లు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.