అమరావతి : లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓం బిర్లా వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, గురుమూర్తి ఉన్నారు. దర్శనం అనంతరం ఆయన తిరుమల చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం విరామ సమయంలో ఓం బిర్లా శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు. అనంతరం తిరుపతి కపిలేశ్వరస్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.