అమరావతి : రేపు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర భవిషత్తు కోసం దిశానిర్దేశం చేయబోతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర సంక్షేమాన్ని కోరే వారందరు ఆహ్వానితులేనని రేపటి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ రూపొందించిన ప్రత్యేక వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా విడుదల చేసింది.
వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రానున్న కాలంలో ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతున్నది అనే విషయాలతో పాటు జనసేన కార్యక్రమాల వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు. తమ పార్టీపై వస్తున్న విమర్శలకు ఆవిర్భావ సభ వేదికగా తగిన సమాధానం చెబుతామని ఆయన అన్నారు. పోలీసులు తమతో సహకరించాలని పవన్ కల్యాణ్ కోరారు.