అమరావతి: శ్రీసిటీలో నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్లాంటును అతి తక్కువ వ్యవధిలో కేవలం 14 నెలల కాలంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాంటు ద్వారా నిత్యం 220 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కానున్నది. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు.
కొవిడ్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు దవాఖానల్లో144 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు జగన్ చెప్పారు. రానున్న రోజుల్లో మరో 32 ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని జగన్ స్పషం చేశారు. ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లతో కరోనా వంటి ఎలాంటి ఆరోగ్య విపత్తు సంభవించినా సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని జగన్ పేర్కొన్నారు.