అమరావతి : ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంపై ప్రభుత్వ సలహదారు(Government advisor) సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి వైసీపీ మొత్తం 7 సీట్లు గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉండగా చంద్రబాబు(Chandra Babu ) క్యాంపు రాజకీయలు, ప్రలోభాలకు గురి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు లోనైన వారు వారి భవిష్యత్ను గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు.
క్యాంపు రాజకీయాలకు, ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబు దేశంలోనే నంబర్వన్ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ(YCP)కి చెందిన ఇద్దరు ప్రలోభాలకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్(Cross Voting) పై వైసీపీ సీనియర్ నాయకులు లోతుగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. టీడీపీ లెక్క ప్రకారం 19 ఉన్నాయి. ఒక్కస్థానం కూడా గెలిచే అవకాశం లేదు. నెల్లూరు రూరల్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు, జనసేన నుంచి వచ్చిన ఒకరు, టీడీపీ నుంచి వచ్చిన మరో ఇద్దరు టీడీపీకి ఓటేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాక తాము అన్ని స్థానాల్లో గెలుపొందాలని ప్రయత్నం చేశామని అన్నారు. అయితే లోపాయికరి ఒప్పందం జరగడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. మొత్తం వైసీపీ ఓటిమి చెందిందని అనుకోవడం లేదని వెల్లడించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఏపీలో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.