అమరావతి: గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో తాత-మనవడి మధ్య జరిగిన ఘర్షణలో మనవడు మృతి చెందాడు. జిల్లాలోని బొల్లాపల్లి మండలం లాలిపురంలో రాత్రి తాత- మనవడు మధ్య ఘర్షణ జరిగింది. ఫూట్గా మద్యం తాగిన తాత సక్రియ నాయక్ కత్తితో పొడిచి మనవడు శ్రీను నాయక్ను చంపిన ఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.