అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. పులివెందుల రెవెన్యూ డివిజన్లోకి ప్రస్తుత జమ్మలమడుగు డివిజన్లోని సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, కడప డివిజన్లో ఉన్న వేంపల్లె, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలను కలిపారు.
కోనసీమ జిల్లాలోని కొత్తపేట, కడప జిల్లాలోని పులివెందులను కొత్త డివిజన్ కేంద్రాలుగా ప్రకటించింది. కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి ప్రస్తుత రామచంద్రాపురం డివిజన్లోని ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, అమలాపురం డివిజన్లోని పి.గన్నవరం, అంబాజీపేట, ఐనవల్లి మండలాలు వచ్చాయి. చిత్తూరు, కృష్ణా, విజయనగరం, కడప జిల్లాలోని రెవెన్యూ డివిజన్లలో మండలాల మార్పులు, చేర్పులు చేశారు.