అమరావతి : ఈ నెల 14న భారత్-దక్షిణాప్రికా టీ-20 మ్యాచ్ను స్వయంగా తిలకించేందుకు గాను క్రీడాభిమానులు పోటాపోటి పడ్డారు. వారం రోజుల క్రితం ఆన్లైన్లో టికెట్ల విక్రయం జరుపగా ఇవాళ నేరుగా విక్రయాలను ప్రారంభించారు. విశాఖలోని స్వర్ణ భారతి స్టేడియం, ఏసీఏ-వీడీసీఏ స్టేడియం 17వ ప్రవేశ ద్వారం వద్ద విక్రయాలను ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేన్ ముందుగానే ప్రచారం నిర్వహించారు. దీంతో క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కొనుగోలుకు భారీగా స్టేడియంకు తరలివచ్చారు.
వీటితో పాటు నగరంలో జ్యోతి థియేటర్లో టికెట్లను విక్రయించారు. కనీస ధర రూ. 600 నుంచి రూ. 6వేల వరకు నిర్ణయించడంతో టిక్కెట్ల కోసం అభిమానులు తరలివచ్చారు. ఎలాంటి తోపులాట జరుగకుండా విశాఖ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ తరువాత విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడం ఇదే ప్రథమం.
స్టేడియంలో ప్రేక్షకుల సామర్థ్యం 57వేలు కాగా వీటిలో 80శాతం టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించారు. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన గంటల్లోనే విక్రయాలు పూర్తయ్యాయి .