శ్రీశైలం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) శ్రీశైలం మల్లికార్జునస్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న సీజేఐ రమణ.. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళహారతి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ ఈవో లవన్న, అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. దర్శనానంతంరం సీజేఐ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.