తిరుపతి : చంద్రయాన్-3 ని విజయవంతంగా పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆగస్టు నెలాఖరుకల్లా చంద్రయాన్ ప్రయోగం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విఫలం కావడంతో శాస్త్రవేత్తలు కాసింత నిరాశకు గురయ్యారు. ఈసారి అలాంటి అవకాశాలు లేకుండా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తున్నది.
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వచ్చే ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది. దీనికి సంబంధించిన తొలి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో మొత్తం 75 ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలో చంద్రయాన్-3 చిత్రాలను పొందుపరిచారు. చంద్రుడి ఉపరితలంపై కాలుమోపనున్న ల్యాండర్, ఆదిత్య-ఎల్1 మిషన్తోపాటు గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా దానిలో తెలిపారు. ఈ వివరాలను అనుసరించి వచ్చే ఆగస్టు నెలలో చంద్రయాన్-3 ని విజయవంతంగా పూర్తిచేయాలన్న సంకల్పంతో షార్ శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.