అమరావతి : క్యాసినో రగడ ఇంకా కంటిన్యూ అవుతున్నది. మంత్రి కొడాలి నానిపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. ప్రతిగా కొడాలి నాని కూడా సవాల్ విసురుతున్నారు. దాంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తనకు మంత్రి కొడాలి నాని సవాల్ విసరడంపై సోమవారం చంద్రబాబు రియాక్ట్ అయ్యాురు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో క్యాసినో జరిగింది నిజమని, జగన్ ఇకనైనా నోరు విప్పి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెప్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. క్యాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని డిసైడ్ అయినట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే, కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాస్కూళ్లకు సెలవులు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎవరెక్కడ పోయితా తనకేంటి అనే ధీమా పనికి రాదని సూచించారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత విస్తృతంగా కరోనా వైద్యసేవలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో తెర వెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా.. కేసును నలుగురికే పరిమితం చేసే పని జరుగుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టించి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు.