అమరావతి : ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్(36) ఒంగోలులో సైకిల్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు మరియదాస్ సైకిల్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అదుపు తప్పిన కారు చెత్త ఆటో, బైక్ను సైతం ఢీ కొట్టడంతో మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న లేడీ డాక్టర్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.