శ్రీకాకుళం : జాతీయ తపాలా బిళ్లల సేకరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న పోస్టర్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
స్టేజీపై ఏర్పాటు చేసిన సోఫాలో మొదట ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చోగా, ఆ తర్వాత అచ్చెన్నాయుడు కూర్చున్నాడు. ఈ సమయంలోనే సోఫా వెనక్కి జరగడంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కింద పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరిని పైకి లేపారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి గాయాలు కాలేదు.