అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం మండలం కొట్నూరులో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది . జిల్లాలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. హిందూపురం నుంచి గోరంట్లకు కొట్నూరు గ్రామం మీదుగా 40 మంది కార్మికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు వరద నీటి ఉద్ధృతికి పక్కకు ఒరిగిపోయింది.
అప్రమత్తమైన డ్రైవర్ ముందుకు వెళ్లకుండా అక్కడే నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది . ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగి ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానికులు క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసి పంపించారు.