Cricket | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): క్రికెట్ ఆటలో నెలకొన్న విదాదం ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకున్నది. ఈ ఘటన ఆదివారం నెల్లూరులోని జాకీర్ హుస్సేన్నగర్లో జరిగింది. సెలవురోజు కావడంతో పలువురు క్రికెట్ ఆడుతున్నారు.
ఆటలో తలెత్తిన వివాదంతో 14 ఏండ్ల బాలుడిని 16 ఏండ్ల మరో బాలుడు గొంతు, గుండెపై గట్టిగా కొట్టగా అక్కడే కుప్పకూలాడు. అతనిని దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాధ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.