అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనుకావడం కలకలం సృష్టించింది. జిల్లాలోని వీరబల్లి కస్తూర్బా పాఠశాల విద్యార్థినీలు కలుషిత ఆహారం తిని వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 30 మంది అస్వస్థతకు గురికావడంతో వీరిని వీరబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న విద్యార్థినీల తల్లిదండ్రులు కస్తూర్బా పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు కలుషిత ఆహారం పెట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.