అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ అధికమవుతున్నది. పాజిటివ్ కేసులూ వందల్లో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,765 నమోదయ్యాయి.
వైరస్ బారినపడి వారిలో 1,245 మంది కోలుకున్నారు. 11 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 9,18,597కు చేరింది.
8,94,896 మంది కోలుకున్నారు. 16422 యాక్టివ్ కేసులుండగా.. 7,279 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 31,892 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి