ఇచ్చోడ, జూలై 19 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సర్పంచ్ మీనాక్షి 50 మంది నిరుపేదలకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)లో ‘ధన్యవాదాలు మీనాక్షి, ఇలాగే మంచి పనిని కొనసాగించండి..’ అంటూ ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షిని ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశారు.