ఎదులాపురం, జనవరి 5 : జిల్లా ప్రజలందరు డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పోలీసు అసోసియేషన్ 2023 సంవత్సర నూతన క్యాలెండర్ను గురువారం అధికారులతో కలిసి ఎస్పీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపద సమయంలో బాధిత ప్రజ లకు జిల్లా పోలీసులు అండగా ఉండాలన్నారు. ఆపత్కాలంలో డయల్ 100ను సంప్రదిస్తే ఐదు నిమిషాల లోపు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ డీఎస్పీలు వీ ఉమేందర్, పోతారం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, రిజర్వ్ సీఐ డీ వెంకటి, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సభ్యులు గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్, కే అనసూయ తదితరులు ఉన్నారు.
డీసీఆర్బీ (డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) డీఎస్పీగా పోతారం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరిం చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంద జేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీఆర్బీ సీఐగా విధులు నిర్వర్తించి గత నెల 27వ తేదీన డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్ డీసీఆర్బీగా ఫంక్షనల్ వర్టికల్కు సంబంధించిన ఇది వరకే ఖాళీ ఉన్న డీఎస్పీ పోస్టు కేటాయించారు. ఓఎస్డీ బీ రాములు నాయక్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, ఎస్ఐ అన్వర్ఉల్ హక్ పాల్గొన్నారు.