చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. సామాజిక ఇతివృత్తానికి కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో చరణ్ అతిథిగానే కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిసింది. రామ్చరణ్ పాత్ర దృక్కోణం నుంచే ‘ఆచార్య’ సినిమా సాగుతుందని సమాచారం. కథలో రామ్చరణ్ పాత్రకు చాలా ప్రాధాన్యముంటుందని, అతిథిలా కాకుండా ద్వితీయార్థం మొత్తం ఆయన సినిమాలో కనిపిస్తారని చెబుతున్నారు. చిరంజీవి, రామ్చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నారనేది అవాస్తవమని తెలిసింది. వారి మధ్య ఉండే బంధం సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.