విగ్రహావిష్కరణలో యువతకు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పిలుపు
కుభీర్, ఏప్రిల్ 8: పేదల కోసం అహర్నిశలు తపిం చిన చాకలి ఐలమ్మ యువతకు స్ఫూర్తి కావాలని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని పల్సి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు రజక సంఘం జెండాను ఎగుర వేశారు. అక్కడే ముదిరాజ్ సంఘం చేపట్టిన వా ల్మీకి మహర్షి విగ్రహ ఏర్పాటు, జీపీ నిధులతో ఎస్సీ కాలనీలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ శ్రీరాముల కవిత, శ్రీరాముల రాజేశ్తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఐలమ్మ విగ్రహం వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరక్షరాస్యురాలైన ఐలమ్మ ధైర్యసాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రజక సంఘం రాష్ట్ర సమన్వయకర్త సుంకెట పోశెట్టి మాట్లాడుతూ రజకులకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇచ్చేందుకు నిర్ణయిం చడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని రజక సంఘం అధ్యర్యంలో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. మాజీ సర్పంచ్ కొట్టె హన్మండ్లు, రజక సం ఘం అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, మార్కె ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కందూరి సంతోష్, దిగంబర్ పటేల్, మండల కో ఆప్షన్ స భ్యుడు దత్తహరి పటేల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, టీఆర్ఎస్ నాయకులు తూం రాజేశ్వ ర్, దాసరి మల్లారెడ్డి, డాక్టర్ రా జన్న, రాములు, ముథోల్ భూమన్న, రజక సంఘం నాయకులు, మహిళలు, గ్రా మస్తులు పాల్గొన్నారు.
కష్ట కాలంలోనూ నిధులు ఆపలే..
కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించినా, అభివృద్ధ్ది పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల కేటాయింపు ఆపలేదని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని పార్డి(బీ) గ్రామంలో రూ.15లక్షలతో చేపట్టిన ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణ పనులకు, రాజురాలో రూ.కోటీ 10లక్షలతో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన భూ మిపూజ చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. స ర్పంచ్లు తూం పుష్పలత, అర్చనా మాన్కర్, మాన్క ర్ సురేశ్, ఉప సర్పంచ్ తుకారాం, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీపీ తూం లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి తూం రాజేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ సంతోష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.