ఖానాపూర్ టౌన్, జూలై 31: ఖానాపూర్ పట్టణం లో జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రే ట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జీ శ్రీదేవి శనివారం ప్రారంభించారు. ముందుగా ఆమెకు ఖానాపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. కోర్టు భవనంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కోర్టు నిర్మాణంతో దూరభారం, సమయభారం స్థానికులకు తప్ప నుందన్నారు. ఈ ప్రాంతంలో 1200 కేసులు పెం డింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఖానాపూర్లో శాశ్వ త కోర్టు భవన నిర్మాణానికి కృషి చేయాలని న్యా యవాదులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఐదెకరాల స్థలం కేటాయిస్తే నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, మెట్పెల్లి, మంచిర్యాల బార్ అసోసియే ష న్ల ఆధ్వర్యంలో జడ్జి జీ. శ్రీదేవిని ఘనంగా స న్మానించారు. జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటివ్ జడ్జి బీ. ఎస్ జగ్జీవన్, బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఏ మల్లారెడ్డి, మంత్ర రాజం సురేశ్, రమణారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూలై 31: మండలంలోని కుంటాల జలపాతాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జీ శ్రీదేవి సందర్శించారు. బోథ్ జడ్జి పీబీ కిరణ్కుమార్, ఎస్ఐ భరత్ సుమన్, తదితరులున్నారు.