కావలసిన పదార్థాలు
మష్రూమ్స్: ఒక కప్పు, పాస్తా: ఒక కప్పు, మైదా: ఒక టేబుల్ స్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పాలు: ఒక కప్పు, చీజ్: పావు కప్పు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా పాస్తాను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్లోని వెన్న వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, మష్రూమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. అన్నీ బాగా వేగాక పాలుపోసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఉడికి దగ్గరపడుతుండగా తరిగిన చీజ్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఉడకబెట్టిన పాస్తా వేసి బాగా కలిపి పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకుంటే.. వేడివేడి క్రీమీ మష్రూమ్ పాస్తా రెడీ.