కావలసిన పదార్థాలు
అరటి పండ్లు: నాలుగు, మైదా పిండి: ఒక కప్పు, బియ్యపు పిండి: అర కప్పు, చక్కెర: ఒక టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు: ఒక టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, బియ్యపు పిండి, చక్కెర, నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. అరటి పండ్ల తొక్కతీసి నిలువుగా సన్నని ముక్కలుగా కోయాలి. అరటి ముక్కల్ని ఆ పిండి మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో దోరగా వేయించుకుంటే కేరళ స్పెషల్ పజమ్ పొరి సిద్ధం.