రామగిరి, మార్చి 23 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 30శాతం పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. నల్లగొండ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ గుంటకండ్ల దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నల్లగొండ మండలాధ్యక్ష కార్యదర్శులు గజవెల్లి సత్యం, యాద వాసుదేవ్, నారాయణరెడ్డి, ఎన్.రంగయ్య, అజీజ్, జెల్లా పుల్లయ్య, సంతోష్రెడ్డి, అఫ్జల్, రఘునాథం పాల్గొన్నారు.
మర్రిగూడ : మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలు సర్పంచ్ నల్ల యాదయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు లపంగి నర్సింహ, రాపోలు యాదగిరి, పగడాల యాదయ్య, శిలువేరు చంద్రయ్య, ఐతగోని వెంకటయ్య, ఆశ కార్యకర్తలు వసంత, భాగ్యమ్మ, మంజుల, కౌసల్య, సునీత, రాణి, బాలమణి పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దాడి అరుణ, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, నాయకులు బొందయ్య అంగన్వాడీ టీచర్లు కొత్తపల్లి అపర్ణ, బుజ్జమ్మ, బి.జ్యోతి, శోభారాణి, కృష్ణవేణి పాల్గొన్నారు.
దేవరకొండ : తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్ణణంలోని సేవాసదనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఎస్జీఆర్ఈఏ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు టి.నర్సింహ, అంకం చంద్రమౌళి, లింగయ్య, బుచ్చయ్య, నారాయణరెడ్డి, ఐజాక్, షరీఫ్, కోటయ్య, సుగుణయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ 475 సంఘం జిల్లా అధ్యక్షుడు గునగంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కర్నాటి శ్రీనివాస్ సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 30శాతం ఫిట్మెంట్తో పాటు పదవీ విరమణ వయస్సు 58నుంచి 61సంవత్సరాలకు పెంచి కాంట్రాక్టు ఉద్యోగులందరి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ యాదయ్య, రాష్ట్ర నాయకులు చారగుండ్ల కృష్ణ, పోటు నవీన్, నిరంజన్రెడ్డి, జి.శ్రీనివాస్, బలభీమరావు, వెంకట్రెడ్డి, వెంకట్రాములు, రవీందర్, లక్ష్మణ్, పున్నమ్మ, భాస్కర్, కుమార్, రాని, అరవింద్, జ్యోతి, రమేశ్, సైదులు, చైతన్య, సతీశ్, స్వాతి, అనన్య పాల్గొన్నారు.
పాలకవీడు : మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వసుంధర, పద్మ, ధనమ్మ, మంగమ్మ, యల్లమ్మ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు. డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, టీచర్లు స్వరూప, శ్రీదేవి, రాధిక, విజయ, లక్ష్మీబాయ్, రాములు, రాంచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్, సాయిలు పాల్గొన్నారు.
హుజూర్నగర్ టౌన్ : రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో మూడుసార్లు అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచి పెద్దన్నలా నిలిచారని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ జిల్లా కార్యదర్శి నిర్మల అన్నారు. హుజూర్నగర్లో టీచర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శాంతారాజ్యం, రమణ, పాపమ్మ, సుమతి, సుధ, సుజాత, జయలక్ష్మి, ఆయాలు పాల్గొన్నారు.
మఠంపల్లి : రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జడ్పీటీసీ జగన్నాయక్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంగన్వాడీ టీచర్లు రాములమ్మ, రమణ, కాశమ్మ, పద్మ, గోవిందమ్మ, ఆయాలు పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో సెర్ప్ సిబ్బంది ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అర్చక ఉద్యోగులు సీఎం కేసీఆర్ పేరిట సహస్ర నామార్చన నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు, ఆలయ ప్రధాన అర్చకుడు చిలకమర్రి శ్రవణాచారి, నాగోజు మల్లాచారి, వేణుగోపాలాచార్యులు, వీరభద్రశర్మ, పెన్నా మోహన్శర్మ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జినుకుంట్ల చంద్రయ్య పాల్గొన్నారు.