హైదరాబాద్ : ఆయుధాలను అక్రమంగా కలిగిఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసులతో కలిసి రాచకొండ పోలీసు స్పెషల్ ఆపరేషన్ టీం ఆయుధాలు కలిగిన ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసింది. రెండు దేశవాలీ తుపాకీలతో పాటు ఐదు లైవ్ రౌండ్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులను మహారాష్ట్రకు చెందిన నందకిశోర్ అలియాస్ మనోజ్(23), రోహన్ రాజీవ్ చందాలియా(24)గా గుర్తించారు. మరొక అనుమానితుడు కిరణ్ శివాజీ కావాలే(24) పరారీలో ఉన్నాడు.