ముషీరాబాద్, ఆగస్టు 22: రిజర్వేషన్లు తొలగించాలని కోరుతూ అగ్రకులాలకు చెందినవారు ఢిల్లీలో ఉద్యమం చేయడం సరైంది కాదని, ఇటువంటి చర్యలు సమాజాన్ని చీల్చుతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. శనివారం విద్యానగర్ బీసీ భవన్లో విలేకరులతో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు వందల సంత్సరాలుగా అన్ని రంగాల్లో అణచివేతకు గురయ్యారని, రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధిలో పయనిస్తున్నారని తెలిపారు.
ఈ అభివృద్ధిని ఓర్వలేకనే కొందరు ఉద్యమాల పేరుతో నాటకాలాడుతున్నారని, వారి ఆటలు సాగనివ్వమని వెల్లడించారు. వారు ఇలాగే మొండికేస్తే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరించారు.