హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): భారతదేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 3 శాతం వరకు ఉన్నదని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇటీవల భారత్-యూఏఈ, భారత్-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని ఒక హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ నుంచి ఎగుమతుల వృద్ధికి ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.