హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/ఇంద్రవెల్లి/కాగజ్నగర్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్కు పులి చర్మం తరలిస్తున్న ముఠాను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ డీఎఫ్వో రాజశేఖర్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన కొందరు అటవీ ప్రాంతంలో గతేడాది డిసెంబర్లో పులిని హతమార్చారు. అప్పటి నుంచి పులి చర్మాన్ని దాచి ఉంచా రు. శనివారం ఆ చర్మాన్ని విక్రయించడానికి కాగజ్నగర్కు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు అటవీ అధికారులు వారిని పట్టుకొని పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముకుంద్రావు అనే వ్యక్తి ఇంట్లో పులి కింది దవడ, ఇతర ఎముకలు లభించాయి. ఈ కేసులో మేస్రం మంకు, దీపక్, చంద్రకాంత్, ఈశ్వర్, లక్ష్మణ్, పెందూరు దేవరావు, ముకుంద్రావులను అదుపులోకి తీసుకొన్నారు.