వాషింగ్టన్: అమెరికాలో పక్షులు అంతుచిక్కని వ్యాధితో చనిపోతున్నాయి. కండ్లు ఉబ్బి, స్వాధీనం తప్పి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది తెలియడం లేదు. ఇలాంటి లక్షణాలతో చనిపోయిన పక్షిని మొదట ఏప్రిల్లో గుర్తించారు. జూన్లో పక్షుల మరణాలు పెరిగాయి. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఇలాంటి కేసులు వేల సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకొంటుండగా తాజాగా పక్షుల్లో కూడా ఓ మహమ్మారి మొదలైందని అనుమానిస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడం ఎన్నడూ చూడలేదని వాషింగ్టన్లోని జంతు సంరక్షణ కేంద్రం డైరెక్టర్ జిమ్ మోన్స్మా చెప్పారు.