SCR Special Trains | సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ఆయా రైళ్లలో టికెట్లన్నీ బుక్ అయ్యాయి. టికెట్ల దొరక్క చాలా మంది ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి – సికింద్రాబాద్, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – తిరుపతి, తిరుపతి – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది.
ఈ నెల 10న తిరుపతి – సికింద్రాబాద్ (07055) ప్రత్యేక రైలు నడువనున్నది. రైలు తిరుపతిలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. 11న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07056) మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు కాకినాడలో ఉంటుంది.
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07057) మధ్య ప్రత్యేక రైలు 12న నడువనుండగా.. రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07071) ప్రత్యేక రైలు 13న రాత్రి 9 గంటలకు, కాకినాడ టౌన్ – తిరుపతి (07072) ప్రత్యేక రైలు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటుంది. తిరుపతి – కాచిగూడ (02707) మధ్య ప్రత్యేక రైలు ఉదయం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. ఆయా రైళ్లను వినియోగించుకోవాలని రైల్వేశాఖ కోరింది.