అహ్మదాబాద్: భారత్తో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ వేసిన 9వ ఓవర్లో డేవిడ్ మలన్(24) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ జేసన్ రాయ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మలన్ ఔటైన ఓవర్లో రెండు ఫోర్లు బాది 10 రన్స్ రాబట్టాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ 2 వికెట్లు నష్టపోయి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం రాయ్(44), బెయిర్స్టో(5) క్రీజులో ఉన్నారు.