హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఇటీవల ప్రకటించిన సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వయిజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు.
ఆలిండియా 11, 19, 29, 32, 34, 37వ ర్యాంకులు కైవసం చేసుకున్నారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఏ ఇంటర్, సీఏ ఫైనల్లో ఒక గ్రూప్ కాని, రెండు గ్రూప్లు కాని పాస్ విద్యార్థులు సుమారు 1800 నుంచి 2000 మంది ఉన్నారని వెల్లడించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.