పీవీ మాట
“భారత రాజ్యాంగ విలువలకు క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానమే ప్రాతిపదిక. క్విట్ ఇండియా ఉద్యమం ఒకేసారి ఉవ్వెత్తున రాలేదు. సుదీర్ఘ చరిత్ర ఉన్నది. సహాయ నిరాకరణోద్యమం, భంగమైన వాగ్ధానాలు, కల్లలైన కలలు, బ్రిటిష్ ప్రభుత్వంపై భారతీయుల అనుమానాలు అన్నీ కలిసి ఈ ఉద్యమానికి పునాదివేశాయి. 1914 మొద టి ప్రపంచ యుద్ధకాలంలోనే బ్రిటిష్ వారిపట్ల భారతీయుల్లో అసంతప్తి మొదలైంది.
యుద్ధ ప్రయత్నాలకు తాము మనస్ఫూర్తిగా మద్దతిస్తామని కాంగ్రెస్ నాయకులు స్వ యంగా ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి భేషరతుగా సహకరించాలని గాంధీజీ ప్రతి ఒక్కరిని ఒప్పించారు. దీంతో మొదటి ప్రపంచ యుద్ధంలో 10 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. కనీసం 37వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యుద్ధం చేస్తున్నామని బ్రిటిష్వారు చెప్తున్నందువల్ల యుద్ధం ముగిసిన వెంటనే మనకు స్వాతంత్య్రం ఇవ్వవలసింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని గాంధీ ఉద్యమించారు.
రెండో ప్రపంచ ఉద్యమం వస్తుందని బ్రిటిష్ వారు ఊహించి ఉండరు. కానీ, 22 ఏండ్ల తర్వాత రానే వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత స్వాతంత్రం ఇస్తామని ఈసారి బ్రిటిష్వారు అనలేదు. పైగా నిర్వీర్యమవుతున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి నాయకుడిగా ఉండదల్చుకోలేదని ప్రధాని చర్చిల్ అన్నారు. ఏదో ఒకటి చేయాలని భారతీయులు భావించసాగారు. బ్రిటిష్ గవర్నమెంట్ను నమ్మకూడదని భావించారు. 1942లో క్విట్ ఇండియా నేపథ్యం ఇది.”