వర్ని, జూన్ 23: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా పనులు చేపట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సిద్దాపూర్ వద్ద రూ.120 కోట్లతో చేపట్టిన రిజర్వాయర్ పనులను గురువారం ఆయన పరిశీలించారు.
రిజర్వాయర్ వద్ద ఎన్ని మీటర్ల ఎత్తున నీళ్లు నిలుస్తాయి? కట్ట ఎత్తు ఎంత? నాణ్యత తదితర వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఆయకట్టు రైతులందరికీ నీరందేలా కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. కాలువలను తవ్వే సమయంలో స్థానిక రైతులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.