హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో నేపథ్యంలో పంట మార్పిడిలో నూతన విధానాలపై దృష్టి సారించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నెల 30న జరుగనున్న నీట్-పీజీ ప్రవేశ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కోరారు. వీడియోకాన్ఫరెన్స్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పోలీస్శాఖ డీజీ మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.