హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. నాటికాలంలో ఇమామ్హసన్, ఇమామ్హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం సాగుతుందని వివరించారు. త్యాగాలకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రంను నిర్వహిస్తున్నారని తెలిపారు. పీర్ల పండుగ పేరుతో తెలంగాణలో హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహర్రం నిలిచిందని వివరించారు. గంగా జమున తెహజీబ్కు ప్రతీకగా నిలిచి లౌకికవాద స్ఫూర్తిని నింపుతున్నదని వివరించారు.