యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు. ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.