హైదరాబాద్: మంథని సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న పరకాల డిపో బస్సు.. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలోని గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు.
బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.