సినీ పరిశ్రమలో సినిమాలు చరిత్ర సృష్టించడం ఎక్కువగా చూస్తుంటాం. కాని ఓ సాంగ్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. సామాన్యుడు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ సాంగ్కు తెగ ఫిదా అయ్యారు. వార్నర్ వంటి స్టార్ క్రికెటర్ కూడా ఈ సాంగ్కు స్టెప్పులేయడంతో ఫుల్ పాపులర్ అయింది. ఈ సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్స చేసి సంచలనాలు సృష్టించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, ఇందులోని ప్రతి పాట శ్రోతలని అలరించింది. అర్మాన్ మాలిక్ పాడిన బుట్టబొమ్మ మరింత ఎక్కువగా జనాలకు రీచ్ అయింది. ఈ సాంగ్ ఈ దశాబ్దంలోనే మోస్ట్ వైరల్ అయిందని చెబుతూ మిర్చి అవార్డ్స్ వారు సాంగ్ పాడిన అర్మాన్ మాలిక్ కు అవార్డు అందించారు. ఈ విషయాన్ని అర్మాన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తన టీం అంతటికీ తన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక ఈ అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నాని తెలిపాడు.