యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో పునర్ నిర్మితమైన అనుబంధ శివాలయంలో శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనంతో ఉద్ఘాటన పర్వాలను ఆలయ అర్చకులు, పురోహితులు, వేదపండితులు, యజ్ఞాచార్య బృందం ప్రారంభించారు. సాయంత్రం అంకురారోపణం, ఉదక శాంతి, రక్షోఘ్న హోమం చేపట్టనున్నారు.
అది పూజల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి, ప్రధానార్చకులు నర్సింహ చార్యులు పాల్గొన్నారు. నేటితో మొదలైన శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. శ్రీరాంపురం (తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి సూచనలతో శైవాగమ ఆచారంగా శివాలయ ప్రతిష్ఠ పర్వాన్ని నిర్వహించనున్నారు. ఉప దేవీదేవతలు ప్రతిష్ఠ, పంచకుండాత్మక హోమాది వేడుకలు చేపట్టనున్నారు.