భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సోమవారం మధ్యాహ్న భోజనసమయంలో ఏఐవైఎఫ్ నాయకులు వంటశాలను తనిఖీ చేయగా నీటిట్యాంకులో బల్లి పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నీటిట్యాంకులో కుళ్లిపోయిన బల్లిని గుర్తించి పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ విషయమై హెచ్ఎం, ఎంఈవో నీరజను వివరణ కోరగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అప్పటికప్పుడు భోజనాన్ని తయారు చేయించి విద్యార్థులకు పెట్టారు. తన అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే సహించేది లేదంటూ.. సీపీఐ నాయకుడు దుర్గరాశి వెంకన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫయీం, 27వ డివిజన్ కార్పొరేటర్ హరితతో వాగ్వాదానికి దిగాడు
– చుంచుపల్లి