నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
దిలావర్పూర్లో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలన
లోకేశ్వరంలో పర్యటన
దిలావర్పూర్, మార్చి 26 : పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో మొక్కల రక్షణపై దృష్టిపెట్టాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ పారూ ఖీ అన్నారు. దిలావర్పూర్లో మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలు, హరితహారం నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా చైతన్యపర్చాలని సూచించారు. ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న మూడురోజులకు ఓ ఉద్యోగికి కరోనా సోకిందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల తరువాత దాని ప్రభావం ఉంటుందని అధికారులకు సూచించారు. అనంతరం నర్సరీని పరిశీలించి, ఎండల నేపథ్యంలో మొక్కలకు రక్షణపై దృష్టిపెట్టాలన్నారు. గ్రీన్మ్యాట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆ తర్వాత సమీపంలోని వైకుంఠధామం పనులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దిలావర్పూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై, ఎంపీడీవో కార్యాలయంలోకి వెళ్లేదారిలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను పరిశీలించి, అధికారులను అభినందించా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్క డే, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో మోహన్రె డ్డి, ఎంపీవో అజీజ్ఖాన్, పంచాయతీ కార్యదర్శి భూ పాల్రెడ్డి, సర్పంచ్ వీరేశ్కుమార్ తదితరులున్నారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు..
లోకేశ్వరం, మార్చి 26 : పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పంచాయతీ సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. హరితహారంలో భాగంగా మండల కేంద్రంతోపాటు పంచగుడి, రాయపూర్కాండ్లీ, గొడిసెర గ్రామాల్లో రోడ్ల వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. అలాగే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను పరిరక్షించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని పారిశుధ్య పనుల వివరాల గురించి ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్రావును అడిగి తెలుసుకున్నారు. విధులపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీపీవో వెంకటేశ్వరావు, ఎంపీవో వెంకటరమణయ్య, తహసీల్దార్ వెంకటరమణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.