హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన నీట్-యూజీ పరీక్షల్లో తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ విద్యార్థి ఖండవల్లి శశాంక్ మెరిశాడు. ఆల్ ఇండియాలో 5వ ర్యాంకు సాధించాడు. 720 మార్కులకు గానూ 715(99.998705) మార్కులు సాధించాడు.
ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పుట్టిపెరిగా. పాఠశాల విద్య కర్నూలులో సాగింది. అమ్మ సుధ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. నాన్న ఫార్మా కంపెనీలో ఉద్యోగం. చదువు విషయంలో మా పేరెంట్స్ నాపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. న్యూరో సర్జన్ కావాలన్నది నా ఆశయం. మంచి ర్యాంకు వస్తే చాలనుకున్నాను కాని 5వ ర్యాంకు వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తాను అని శశాంక్ తెలిపాడు.