హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్టీయూ పరిధిలో సోమవారం జరగనున్న పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదావేశారు. వర్షాల కారణంగా నేడు జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదావేస్తున్నట్లు తెలిపారు. రేపట్నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదాపడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.