నేడు వాగులోకి నీటిని విడుదల చేయనున్న మంత్రి హరీశ్రావు
కూడవెల్లి వద్ద ముమ్మరంగా కాలువ పనులు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనుల్లో నిమగ్నమైన అధికారులు
వేలాది ఎకరాల్లో సాగవుతున్న వరికి మేలు
గజ్వేల్ రూరల్/తొగుట, మార్చి 22: మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద గజ్వేల్ నియోజకవర్గం నుంచి దుబ్బాక నియోజకవర్గం మీదుగా సిరిసిల్ల నియోజకవర్గం వరకు సాగునీటి వనరుగా ఉన్న కూడవెల్లి వాగు గోదారమ్మ నీటితో పరవళ్లు తొక్క నున్నది. గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువ నుంచి కూడవెల్లి వాగులోకి గోదావరి నీటిని మంగళవారం మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభా కర్రెడ్డి విడుదల చేయనుండగా, కూడవెల్లిని ఆసరా చేసుకొని వేలాది ఎకరాల్లో సాగైన పంటలకు నీరు అందనున్నది. వరి పంట పొట్ట దశలో ఉంది. నీటి అవసరం ఎక్కు వగా ఉన్న దశలో వాగులో నీళ్లు అడుగంటిపోవడంతో వరి పంట మీద రైతులు ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది.
ముమ్మరంగా కనెక్టింగ్ కాలువ పనులు
కూడవెల్లి వాగు పరిసర ప్రాంత రైతులు సాగు చేసిన వరికి నెల రోజుల పాటు నీళ్లు అందకపోతే తీరని నష్టం వాటిల్లు తుందని, కాళేశ్వరం నీటిని కూడవెల్లి వాగులోకి వదిలితే పం టలకు జీవం పోసినట్లు అవుతుందని మంత్రి హరీశ్రావు దృష్టికి గజ్వేల్ మండల రైతులు తీసుకెళ్లారు. సమస్య పరి ష్కారం కోసం సీఎం కేసీఆర్తో మంత్రి హరీశ్రావు ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించడంతో తక్షణమే కొడకండ్ల జం క్షన్ నుంచి కాళేశ్వరం నీటిని వదిలేందుకు సీఎం ఆదేశించ డంతో ఆది, సోమవారాల్లో 400 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో కూడవెల్లి వాగు వరకు కనెక్టింగ్ కాలువ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రైతుల వద్ద నుంచి భూసేకరణ చేసిన తర్వాత ఇరిగేషన్ అధికారులు పను లు ప్రారంభించారు.
పనులు నేటి రాత్రి వరకు కొనసాగు తాయి. మంగళవారం మంత్రి హరీశ్రావు కాళేశ్వరం నీటిని కూడవెల్లి వాగులోకి వదిలేందుకు చకచక ఏర్పాటు జరుగుతు న్నాయి. మంత్రి ఆదేశాలతో గడ ఓఎస్డీ ముత్యంరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఈఈ నారా యణ పనులను పర్యవేక్షిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్లోకి వెళ్లే కెనాల్కు గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద జంక్షన్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రెండు రోజులుగా తీస్తున్న కనెక్టింగ్ కెనాల్ ద్వారా వాగులోకి నీళ్లను వదిలితే కూడవెల్లి వాగుపై గజ్వేల్, తొగుట, దుబ్బాక మండలాల్లోని ఆయా గ్రామాల సమీపంలో నిర్మించిన 36 చెక్డ్యాంలు జలకళతో సంతరించుకుంటాయి. దీంతో రైతులు సాగు చేసిన వరికి మేలు చేకూరుతుంది.