మంచిర్యాలటౌన్, మార్చి 21: ఆడబిడ్డలు ఉన్న పేదింటి తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నా రు. మంచిర్యాల మున్సిపల్ కార్యాల యం ఆవరణలోని మెప్మా హాలులో 116 మంది లబ్ధిదారులకు మంజూరై న చెక్కులను ఆదివారం అందజేశారు. మంచిర్యాలలో త్వరలోనే వంద పడకల మాతా శిశు ఆరోగ్యకేంద్రం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బస్టాండ్ సమీపంలో ఉన్న కబ్రస్థాన్లో రూ.24 లక్షల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఒకటోవార్డు రాజీవ్నగర్లో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూ జ చేశారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, కౌన్సిలర్లు హరికృష్ణ, రాజు, మహేశ్వరి, సుమతి, నాయకులు బుద్దార్థి రాంచందర్, వధూద్, తాజొద్దీన్, బొలిశెట్టి కిషన్, రవీందర్రావు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిక
తెలంగాణ ఉద్యమకారుడు ఆరె శ్రీనివాస్ ఎమ్మెల్యే దివాకర్రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంచిర్యాల ఐబీలో దాదాపు 250 మంది అనుచరులతో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గాదెసత్యం, నస్పూర్ మం డలాధ్యక్షుడు వంగ తిరుపతి, హాజీపూర్ మం డలాధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ
దండేపల్లి, మార్చి 21 : మండల కేంద్రంలో 115 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె క్కులను ఎమ్మెల్యే దివాకర్రావు పంపిణీ చేశా రు. మేదరిపేటలో రూ.33 లక్షలతో నిర్మించను న్న డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, సురేశ్, తహసీల్దార్ హన్మంతరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.