హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉన్నదని మస్కట్లో స్థిరపడిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇదే మాడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఆ సత్తా కేసీఆర్లోనే..
సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టి కలిగిన నాయకుడు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ఇదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దేశంలోని కోట్ల మంది రైతులకు అండగా నిలవాలి. దేశాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం. అధికార మదంతో విర్రవీగుతున్న బీజేపీని దీటుగా ఎదుర్కోగల ఏకైక నేత కేసీఆర్ మాత్రమే.
– తులసీరామ్, మస్కట్
దేశానికి కేసీఆర్ సేవలు చాలా అవసరం
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల్లో మార్పు రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలి. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలతో ఎందరో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. యావత్తు జాతిని ఏకం చేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి. అది సీఎం కేసీఆర్తోనే సాధ్యం
– మహమ్మద్ అజారుద్దీన్, మస్కట్
తెలంగాణ మాడల్ దేశానికి కావాలి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇప్పుడు తెలంగాణ మాడల్ దేశానికి అవసరం. కేసీఆర్ జాతీయరాజకీల్లోకి వచ్చి తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. బీజేపీ పాలనతో దేశ పౌరులు అభద్రతా భావంలో ఉన్నారు. దీని నుంచి బయటపడి ప్రజలంతా స్వేచ్ఛగా జీవించాలంటే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది.
– ఇక్బాల్ అహ్మద్, మస్కట్