హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన గూడూరి ప్రవీణ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేండ్ల పాటు ఆయన పదవిలో ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సిరిసిల్లకు చెందిన ప్రవీణ్ గతంలో సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్), సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు చేనేత, టెక్స్టైల్ రంగంలో అపార అనుభవం ఉన్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాల పరిశ్రమ ఉన్న సిరిసిల్లకు టీపీటీడీసీఎల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై నేత కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తనను చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు.